వర్జీనియాకు చెందిన యువతికి కిరీటం

వర్జీనియాకు చెందిన యువతికి కిరీటం

వాషింగ్టన్: మిస్​ ఇండియా యూఎస్ఏ 2022 కిరీటాన్ని వర్జీనియాకు చెందిన ఇండియన్ అమెరికన్ యువతి ఆర్యా వల్వేకర్ సొంతం చేసుకున్నారు. న్యూజెర్సీలో జరిగిన ఈ అందాల పోటీల్లో 30 రాష్ట్రాల నుంచి 74 మండి పోటీపడగా ఆర్యా విజయం సాధించారు.

వర్జీనియా వర్సిటీ స్టూడెంట్ సౌమ్య శర్మ రన్నరప్‌‌‌‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి మూడో స్థానంలో నిలిచారు. వాషింగ్టన్​కు చెందిన అక్షి జైన్ ​మిసెస్ ఇండియా యూఎస్, న్యూయార్క్​కు చెందిన తన్వీ గ్రోవర్​మిస్ టీన్​ఇండియా యూఎస్​ఏ కిరీటాలు గెలుచుకున్నారు.