వాషింగ్టన్: మిస్ ఇండియా యూఎస్ఏ 2022 కిరీటాన్ని వర్జీనియాకు చెందిన ఇండియన్ అమెరికన్ యువతి ఆర్యా వల్వేకర్ సొంతం చేసుకున్నారు. న్యూజెర్సీలో జరిగిన ఈ అందాల పోటీల్లో 30 రాష్ట్రాల నుంచి 74 మండి పోటీపడగా ఆర్యా విజయం సాధించారు.
వర్జీనియా వర్సిటీ స్టూడెంట్ సౌమ్య శర్మ రన్నరప్గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి మూడో స్థానంలో నిలిచారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్, న్యూయార్క్కు చెందిన తన్వీ గ్రోవర్మిస్ టీన్ఇండియా యూఎస్ఏ కిరీటాలు గెలుచుకున్నారు.