ట్రంప్ ఓ జాత్యాహంకారి..మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అమెరికాలో దాడులు జరుగుతున్నాయంటే దానికి ట్రంప్ వైఖరే కారణమంటూ.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. భారతీయ అమెరికన్లంటే ఆయనకు అస్సలు పడదు.. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ను ఓడించండి.. నేను అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తానని అన్నారు. చైనాయే కాదు.. మరే ఇతర దేశం కూడా సరిహద్దు దేశాల్లో అలజడులు సృష్టించకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అంతేకాదు అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ట్యూషన్ ఫీజును లక్షా 25వేల డాలర్లలోపే ఉండేలా చర్యలు తీసుకుంటామన్న బైడెన్.. దీని వల్ల వేలాది భారతీయ అమెరికన్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నేను కమలా హారిస్ను ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేసినప్పుడు మీరు బాగా సంతోషించారని నాకు తెలుసు.. ఆమె కథ… మీ కథ ఒక్కటే.. .. అంటూ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తనకు మద్ధతుగా నిలిచి గెలిపించాల్సిందిగా ఆయన ఇండియన్ అమెరికన్లను కోరారు.