పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ఫ్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి విద్య,సాహిత్యం విభాగంలో పద్మశ్రీ దక్కగా, ఏపీ నుంచి  సామాజిక సేవా విభాగంలో కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ లభించింది. గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులు 1954లో మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా  పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ అత్యున్నత పురస్కారాలకు అందజేస్తారు.