మెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ పతకం

మెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణ పతకం

కైరో: ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా షూటర్లు సత్తా చాటుతున్నారు. మెగా టోర్నీలో ఇండియాకు ఐదో గోల్డ్‌‌‌‌‌‌‌‌ అందించారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో రుద్రాంక్ష్, కిరణ్‌‌‌‌‌‌‌‌ అంకుశ్‌‌‌‌‌‌‌‌, అర్జున్‌‌‌‌‌‌‌‌ బబుతాతో కూడిన ఇండియా గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. శనివారం జరిగిన ఫైనల్లో ఈ త్రయం 16–10తో చైనా జట్టును ఓడించింది. ఇప్పటికే 10 మీ. ఎయిర్ రైఫిల్‌‌‌‌‌‌‌‌లో చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన రుద్రాంక్ష్ కు రెండో గోల్డ్‌‌‌‌‌‌‌‌ లభించింది.

విమెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. ఫైనల్లో  పాలక్‌‌‌‌‌‌‌‌, రిథమ్‌‌‌‌‌‌‌‌ సాంగ్వాన్‌‌‌‌‌‌‌‌, యువికా తోమర్‌‌‌‌‌‌‌‌తో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌ 8–16తో చైనా చేతిలో ఓడిపోయింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో మేఘన, మెహులీ ఘోష్‌‌‌‌‌‌‌‌, ఎలవెనిల్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా 17–11తో జర్మనీని ఓడించి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. 25 మీటర్ల స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్​లో మాన్వి జైన్‌‌‌‌‌‌‌‌–సమీర్‌‌‌‌‌‌‌‌ జంట సిల్వర్‌‌‌‌‌‌‌‌ రాబట్టగా, పాయల్‌‌‌‌‌‌‌‌ ఖత్రి–సాహిల్‌‌‌‌‌‌‌‌ దుదానె ద్వయం బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది.