న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో ఇండియా షూటర్లు గోల్డ్ మెడల్తో మెరిశారు. చాంగ్వాన్ (సౌత్ కొరియా)లో బుధవారం జరిగిన మెన్స్ స్కీట్ ఫైనల్లో అనంత్ జీత్ సింగ్ నరుకా, గురుజ్యోత్ కంగురా, అంగద్ వీర్ సింగ్ బాజ్వాతో కూడిన ఇండియా త్రయం 358 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
ఒక్క పాయింట్ తక్కువ సాధించిన కొరియాకు సిల్వర్, కజకిస్తాన్కు బ్రాంజ్ మెడల్స్ లభించాయి. ఇక ఇండివిడ్యువల్ ఫైనల్లో అనంత్, గురుజ్యోత్ వరుసగా నాలుగు, ఆరో ప్లేస్లో నిలిచి మెడల్కు దూరమయ్యారు. క్వాలిఫికేషన్లో 581 పాయింట్లు గెలిచిన సరబ్జ్యోత్, సురభి రావు కూడా సిల్వర్ను సాధించారు. మరోవైపు విమెన్స్ స్కీట్ టీమ్ నిరాశపర్చింది. గనేమత్ సెకోన్ 108 పాయింట్లతో 15వ ప్లేస్లో నిలవగా, కార్టికి సింగ్ షెరావత్, పరినాజ్ దలివాల్ వరుసగా 17, 18వ ర్యాంక్లతో సరిపెట్టుకున్నారు.