చైనా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌

చైనా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ప్రణయ్‌‌‌‌

షెన్‌‌‌‌జెన్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ హెచ్‌‌‌‌.ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌, సాత్విక్‌‌‌‌ సాయిరాజ్–చిరాగ్‌‌‌‌ షెట్టి.. చైనా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో ఎనిమిదో సీడ్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ 21–18, 22–20తో  చౌ టైన్  చెన్‌‌‌‌ (చైనీస్‌‌‌‌ తైపీ)పై గెలిచాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన ప్రణయ్‌‌‌‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా తట్టుకున్నాడు. 

50 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో బలమైన స్మాష్‌‌‌‌లు, సుదీర్ఘమైన ర్యాలీలతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌‌‌‌లో 8–9తో వెనకబడిన  దశలో ప్రణయ్‌‌‌‌ అద్భుతంగా పుంజుకుని స్కోరును సమం చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌‌‌‌లో ఓ దశలో స్కోరు 20–20తో ఈక్వల్‌‌‌‌ అయ్యింది. అయితే రెండు సూపర్‌‌‌‌ డ్రాప్​ షాట్లతో ఇండియా షట్లర్​  విన్నర్‌‌‌‌గా నిలిచాడు. 

మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి 21–13, 21–10తో బెన్‌‌‌‌ లాన్‌‌‌‌–సీన్‌‌‌‌ వెండి (ఇంగ్లండ్‌‌‌‌)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఆకర్షి కశ్యప్‌‌‌‌ 12–21, 14–21తో జాంగ్‌‌‌‌ యి మాన్‌‌‌‌ (చైనా) చేతిలో ఓడింది.