ఒడెన్స్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి చుక్కెదురైంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో ఆమె పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్లో సింధు18–-21, 21–-19, 7–-21తో తనకంటే మెరుగైన ర్యాంకర్ కరోలిన్ మారిన్(స్పెయిన్) చేతిలో పోరాడి ఓడిపోయింది.
మారిన్ చేతిలో సింధుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. కాగా, మంచి స్నేహితులైన ఈ ఇద్దరూ మ్యాచ్ టైమ్లో ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. దాంతో చైర్ అంపైర్ ఇద్దరికీ ఎల్లో కార్డులు చూపెట్టి వార్నింగ్ ఇచ్చారు.