దుబాయ్: ఇండియా టాప్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. బుధవారం రిలీజ్ చేసిన తాజా జాబితాలో సూర్య ఖాతాలో 838 రేటింగ్ పాయింట్లున్నాయి. పాకిస్తాన్ ఓపెన్ మహ్మద్ రిజ్వాన్ (861) టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు.
కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 13, 15, 16వ ర్యాంక్ల్లో ఉన్నారు. బాబర్ ఆజమ్, మార్క్రమ్, డేవన్ కాన్వే వరుసగా మూడు నుంచి ఐదో ర్యాంక్లో నిలిచారు. బౌలింగ్లో ఇండియా నుంచి టాప్–10లో ఎవరూ లేరు. భువనేశ్వర్ 12వ ర్యాంక్లో ఉండగా, అశ్విన్, అక్షర్ పటేల్ వరుసగా 22, 23వ స్థానాలను దక్కించుకున్నారు. ఆల్రౌండర్ లిస్ట్లో హార్దిక్ పాండ్యా ఆరో ర్యాంక్లో కొనసాగుతున్నాడు.