ఫైనల్లో బోపన్న జోడీ

ఫైనల్లో బోపన్న జోడీ

మియామి : ఇండియా వెటరన్‌‌ టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ రోహన్‌‌ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌‌ (ఆస్ట్రేలియా) జోడీ.. మియామి ఓపెన్‌‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ సెమీస్‌‌లో టాప్‌‌సీడ్‌‌ బోపన్న-ఎబ్డెన్‌‌ 6-1, 6-4తో నాలుగో సీడ్‌‌ మార్సెల్‌‌ గ్రానోలర్స్‌‌ (స్పెయిన్‌‌)-హోరాసియో జాబెలాస్‌‌ (అర్జెంటీనా)పై గెలిచి టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించారు.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌లో బోపన్న జోడీ రెండు ఏస్‌‌లు కొట్టి, ఒక డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేసింది. తమ సర్వీస్‌‌లో 91 శాతం పాయింట్లు సాధించింది. ఏడు బ్రేక్‌‌ పాయింట్లలో మూడింటిని కాచుకుంది. 9 సర్వీస్‌‌ గేమ్‌‌లను నిలబెట్టుకున్న ఇండో-ఆసీస్‌‌ ద్వయం ఒక్క అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్‌‌ కూడా చేయలేదు.