చెప్పినట్లే ఇందిరమ్మ బిల్లులు ఇస్తున్నం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

చెప్పినట్లే ఇందిరమ్మ బిల్లులు ఇస్తున్నం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ఖిల్లాగణపురం, వెలుగు: ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు ఇస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శనివారం ఖిల్లాగణపురంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు  రాజేశ్వరికి ప్రభుత్వం తరపున మంజూరైన మొదటి బిల్లుకు సంబంధించిన రూ.లక్ష చెక్కును  అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పేరుతో ఇల్లు లేని నిరుపేదలను మోసం చేసిందని చెప్పారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పీఏసీఎస్​ చైర్మన్​ మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, పీఏసీఎస్​ డైరెక్టర్  సాయి చరణ్ రెడ్డి, నాయకులు ఆగారం ప్రకాశ్, రవి నాయక్, బాలకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, మున్నూరు జయకర్, నవీన్ రెడ్డి, యాదగిరి, క్యామ రాజు, శ్రీరాములు పాల్గొన్నారు.