బంగ్లా పులులు తేలిపోయారు: టీమిండియా ఘన విజయం

బంగ్లా పులులు తేలిపోయారు: టీమిండియా ఘన విజయం

ఆతిథ్య జట్టును వారి సొంతగడ్డపై ఓడిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. బంగ్లాదేశ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయాన్ని అందుకుంది. బంగ్లా నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 16.2 ఓవర్లలోనే చేధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

తొలుత టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. బంతికి పరుగు చొప్పున చేయడానికే నానా అవస్థలు పడ్డారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 114 పరుగుల వద్ద బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం 115 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళా బ్యాటర్లు ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను చేధించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హాఫ్ సెంచరీ(54) చేయగా.. స్మ్రితి మందాన(38) పరుగులతో రాణించింది. ఈ ఇరు జట్ల మధ్య రెండో టీ20 జూలై 11న ఇదే వేదికగా జరగనుంది.