
మహారాష్ట్రలోని యావత్మల్ లో దారుణం జరిగింది. ఘతంజీ తహసీల్లోని కప్సి కోప్రి గ్రామాంలో పోలియో చుక్కలకు బదులు చిన్నారలకు శానిటైజర్ వేశారు. దీంతో 12 మంది చిన్నారులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఒక చిన్నారి వాంతులు చేసుకుంది. చిన్నారులంతా ఐదేళ్లలోపు ఉన్నవాళ్లే. చిన్నారులను యవత్మల్లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు అధికారులు. పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసిన ముగ్గురు హెల్త్ కేర్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.
see more news