బైకుపై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. లాక్కెళ్లి రేప్

బైకుపై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. లాక్కెళ్లి రేప్
  • గుంటూరు శివార్లలో నిన్న రాత్రి ఘటన

గుంటూరు: పెళ్లికి హాజరై బైకుపై ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులపై నగర శివార్లలో దుండగులు అడ్డగించి దాడి చేశారు. భర్తను కొట్టి బంధించి.. అతని కళ్లెదుటే భార్యను రోడ్డుపక్కన పొలాల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బుధవారం రాత్రి జరిగిందీ ఘటన. 
సత్తెనపల్లి మండలానికి చెందిన భార్యా భర్తలు బుధవారం గుంటూరు టౌన్ లో పెళ్లికి హాజరై రాత్రి స్వగ్రామానికి చేరుకునేందుకు బైకుపై బయలుదేరారు. ఊరిబయట మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో నిర్జన ప్రదేశంలో కొందరు యువకులు దంపతుల వాహనాన్ని అడ్డగించి నిలిపేశారు. ఒక్కసారిగా మీదపడి దాడి చేస్తూ.. మహిళను లాక్కెళ్లారు. కొందరు భర్తను బంధించి కేకలు వేస్తే.. చంపేస్తామని బెదిరించారు. మహిళను రోడ్డుపక్కన పొలాల్లోకి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. 
అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడిన భార్యా భర్తలు అతికష్టం మీద సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. ఘటన గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుందని తిప్పి పంపారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు కేసు సంబంధింత పోలీసు స్టేషన్ కు బదిలీ చేయాల్సిన పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికే నిరాకరించి వెనక్కి పంపడం తీవ్ర విమర్శలపాలైంది.