
గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్అనుబంధ ఐఎన్టీయూసీతోనే రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని యూనియన్ ఆల్ ఇండియా సీనియర్ సెక్రటరీ, ఎన్టీపీసీ నేషనల్మజ్దూర్ యూనియన్ లీడర్, ఎన్బీసీ మెంబర్బాబర్సలీంపాష తెలిపారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని యూనియన్ఆఫీస్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత నెల 4న ఎన్జేపీ మీటింగ్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించామన్నారు. ఎన్టీపీసీలో మ్యాన్ పవర్ తగ్గడంతో ఉన్న ఉద్యోగులపై భారం పడుతోందని, కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయాలని మేనేజ్మెంట్ను డిమాండ్ చేశామని, దీనికి అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
ఎన్బీసీలో తక్కువ సభ్యత్వం ఉన్న బీఎంఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని, ఐఎన్టీయూసీ మాత్రమే ఉద్యోగుల డిమాండ్లను సాధిస్తుందన్నారు. ఉద్యోగులకు తమ యూనియన్పై విశ్వాసం ఉందని, ఈ నెల 25న జరగనున్న ఉద్యోగ గుర్తింపు ఎన్నికల్లో మజ్దూర్యూనియన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీటింగ్లో యూనియన్ లీడర్లు కిష్టయ్య, ఆరేపల్లి రాజేశ్వర్, సువర్తన్ రావు, మణికంఠ, రమేశ్, కందుల స్వామి, చందర్, భాస్కర్, చిన్నయ్య, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.