కోహ్లీని ఔట్ చేయడమే నా టార్గెట్

కోహ్లీని ఔట్ చేయడమే నా టార్గెట్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని ఔట్ చేయడమే తన లక్ష్యమని సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. ఈ యేడు ఐపీఎల్ లో తన సూపర్ స్పీడ్ బౌలింగ్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ పేసర్.. తనకు ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీ వికెట్ తీయాలని ఉందన్నాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. రాహుల్, కోహ్లీకి తాను ఫ్యాన్ అన్నాడు. వారిద్దరినీ ఔట్ చేయాలని ఉందని.. గత మ్యాచులో రాహుల్ వికెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదన్నాడు. తర్వాత ఆర్సీబీతో జరగబోయే మ్యాచులో కోహ్లీని ఎలాగైనా ఔట్ చేయాలని భావిస్తున్నానని ఉమ్రాన్ చెప్పాడు. 

విరాట్ వికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని ఉమ్రాన్ అన్నాడు. అందుకు వందశాతం కృషి చేస్తానన్నాడు. మిగిలినది దేవుడికే వదిలేస్తానన్నాడు. ఇకపోతే, మరో పేసర్  నటరాజన్ కు కరోనా సోకడంతో అతడి స్థానంలో టీమ్ లో చోటు దక్కించుకున్నాడు ఉమ్రాన్ మాలిక్. అందివచ్చిన అవకాశాలను  వినియోగించుకుంటూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను భీకరమైన పేస్ బాల్స్ తో భయపెడుతున్నాడు. ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన వారిలో  ఉమ్రాన్  రెండో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో అతడు 152.95 వేగంతో బౌలింగ్ చేశాడు. అలాగే  పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో చివరి ఓవర్లో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు. 

మరిన్ని వార్తల కోసం:

మోడీ నాకు ఖాస్ దోస్త్

లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు