IPL 2024: ముంబైని ఆదుకున్న తిలక్, నేహాల్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

IPL 2024: ముంబైని ఆదుకున్న తిలక్, నేహాల్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 17వ సీజన్ లో  జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న  మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్స్ తడబడి నిలిచారు. దీంతో ముంబై, రాజస్థాన్ జట్టుకు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. భారీ ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు రోహిత్ శర్మ(6), ఇషాన్ కిషాన్(0)లతోపాటు సూర్యకుమార్ యాదవ్(10)లు ఘోరంగా విఫలమయ్యారు. 

 స్వల్ప వ్యవధిలో ముగ్గురు పెవిలియన్ కు చేరడంతో ముంబై 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(65), నేహాల్ వధేరా(49)లు జట్టును ఆదుకున్నారు. మెరుపు బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం నబీ(23) కూడా ధనాధన్ బ్యాటింగ్ అలరించాడు. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లు తీసి ముంబైని కట్టడి చేశాడు. ఇక,  బౌల్ట్ రెండు వికెట్లు, అవేశ్ ఖాన్, చాహల్ లు చెరో వికెట్ తీశారు.