20 నిమిషాల్లోనే అమ్ముడు పోయిన రైలు టికెట్లు

20 నిమిషాల్లోనే అమ్ముడు పోయిన రైలు టికెట్లు

ఎంపిక చేసినరూట్లలో ఇవాళ్టి( మంగళవారం) నుంచి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో IRCTC నిన్న(సోమవారం) టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మకాలు ప్రారంభం కాగా 20 నిమిషాల్లోనే టికెట్లు మొత్తం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకే సేల్స్ ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక సమస్యల కారణంగా ఆరు గంటలకు మొదలయ్యాయి.

హౌరా-ఢిల్లీ మధ్య నడిచే రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు కేవలం పది నిమిషాల్లోనే అమ్ముడుపోగా… మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. భువనేశ్వర్-ఢిల్లీ రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు అరగంటలోనే అమ్ముడయ్యాయి.