న్యూఢిల్లీ : పాలసీదారుడు మరణిస్తే త్వరగా పరిహారం చెల్లించేలా ‘ఆటోమేటెడ్ డెత్క్లెయిమ్ సెటిల్మెంట్’ అమలు చేయడానికి ఐడియాలు ఇవ్వాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) కోరింది. ఇందుకోసం చేపట్టిన మొదటి హ్యాకథాన్లో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించింది. హ్యాకథాన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభమయిందని రెగ్యులేటరీ ఏజెన్సీ తెలిపింది.
పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఆటోమేటెడ్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్, మిస్ సెల్లింగ్ను తగ్గించడం, ఇన్సూరెన్స్ ఎకోసిస్టమ్లోని ఇతర రంగాల కోసం టెక్నాలజీతో నడిచే కొత్త విధానాలను అభివృద్ధి చేయడానికి, బీమా మోసాలను తగ్గించడానికి ఐడియాలను ఇవ్వాలని కోరింది. బీమా మంథన్ 2022లో భాగంగా- 'ఇన్నోవేషన్ ఇన్ ఇన్సూరెన్స్' థీమ్తో దరఖాస్తులను ఆహ్వానించింది. టెక్నాలజీ తో ప్రతి వ్యక్తికి సమర్థంగా, వేగంగా బీమాను అందుబాటులోకి తేవడానికే ఈ ప్రయత్నమని ప్రకటించింది.