హైదరాబాద్, వెలుగు: హుస్సేన్ సాగర్ తీరాన ఈ నెల 4,5వ తేదీల్లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్), ఎఫ్4 ఇండియన్ చాంపియన్షిప్ రేస్లు రద్దయ్యాయి. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో సిటీలో ప్లాన్ చేసిన రేస్లను చెన్నైకి తరలించినట్టు ఆర్గనైజర్స్ మంగళవారం ప్రకటించారు. 4,5వ తేదీల్లో చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేస్లు జరుగుతాయని తెలిపారు. హైదరాబాద్లో రేస్ల కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.