గోవాలో ఐరన్ మెన్ రేస్ షురూ

గోవాలో ఐరన్ మెన్ రేస్ షురూ

గోవాలోని పనాజీలో ఐరన్ మెన్ స్పోర్ట్స్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. మొత్తం 33 దేశాల నుంచి 14 వందల 50 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది మొదటిసారి మహిళలు కూడా పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్మీ, నేవీ, పోలీస్ డిపార్ట్ మెంట్ల నుంచి 90 మందిని పోటీల్లో పాల్గొనేందు ఆహ్వానించినట్లు తెలిపారు.

ఐరన్ మెన్ 70.3 రేస్ లో... 1.9 కిలోమీటర్ల స్విమింగ్, 90 కిలోమీటర్ల  సైక్లింగ్, 21 కిలోమీటర్ల రన్సింగ్ పోటీలు ఉన్నాయి. మొత్తం 14 వందలకు పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు..ఎంపీ తేజశ్ సూర్య పాల్గొన్నారు. ఇలాంటి పోటీల వల్ల ఫిజికల్ ఫిట్ నెసే కాకుండా మానసిక ఉల్లాసం కూడా ఉంటుందన్నారు.