కరెంటు బిల్లు కట్టకుండా… కనీసం ఒక లీటరు నీళ్లు.. కేజీ కూరగాయలు కూడా కొనకుండా..
పెట్రోల్కు రూపాయి ఖర్చు పెట్టకుండా.. బతకడం ఈ రోజుల్లో అసాధ్యం కదూ!
కానీ, ఈమె మాత్రం ఇది సాధ్యమని నిరూపిస్తోంది.
అలాగని ఆమె ఫ్యామిలీ అడవిలో ఏమీ బతకట్లేదు. డెహ్రాడూన్ వంటి పెద్ద సిటీలో ఉంటోంది.
ప్రకృతి వనరుల్ని వాడుకుని, అందరిలా బయట రూపాయి ఖర్చు పెట్టకుండా బతికేస్తోంది.
ఆమే.. సౌమ్యా ప్రసాద్. ఇదంతా ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఆమె ఫ్యామిలీని కలవాల్సిందే!
సౌమ్యా ప్రసాద్ డబ్బుని వేస్ట్గా ఖర్చు పెట్టదు. డబ్బులే కాదు ఏదైనా అంతే. వేస్ట్ చేయకూడదన్నది ఆమె ఫిలాసఫీ. ‘నేచర్ మనకు అన్నీ ఇచ్చింది.మనమే తీసుకోవట్లేదు, వాడుకోవట్లేదు’ అంటోందామె. సౌమ్య డెహ్రాడూన్కు రాకముందు ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ జేఎన్యూ (ఢిల్లీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేసేది. ఎకాలజీ ఆమె సబ్జెక్ట్. ప్రకృతిలో ఉండే జీవుల గురించి చెప్పే ఆమెకు. వాటికి మనం చేసే పనుల వల్ల వస్తున్న ఆపదలన్నీ తెలుసు. అయితే ప్రొఫెసర్గా, ప్రకృతిని పాడు చేయకూడదు అని పాఠాలు చెప్పి ఊరుకోలేదామె. ప్రకృతిని కాపాడే లైఫ్స్టైల్ను అలవాటు చేసుకుంటేనే స్టూడెంట్స్కు రోల్మోడల్గా ఉండొచ్చని అనుకుంది. ఎన్విరాన్మెంట్కి నష్టం ఉండొద్దని పొగరాని కారే కావాలనుకుంది. ఆరు లక్షలు పెట్టి ఎలక్ర్టిక్ కార్ కొని వాడుతోంది.
పొల్యూషన్కి సొల్యూషన్
ఢిల్లీలో పొల్యూషన్ ప్రాబ్లమ్ని అందరూ పట్టించుకోకముందే సౌమ్య గుర్తించింది. సొల్యూషన్ ఏమిటో చెప్పి, ప్రాక్టీస్ చేసింది. తానొక్కతే చేస్తే మారదు కదా. అప్పటికే ఆమెకు రెండేళ్ల బిడ్డ ఉంది. ఆ బిడ్డ హెల్దీగా ఉండాలంటే పొల్యూషన్ లేని చోట పెంచాలనుకుంది. వాళ్లాయన డాక్టర్ రమన్ కుమార్ కూడా ఓకే అన్నాడు. ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2015లో డెహ్రాడూన్ వెళ్లింది. అక్కడ అపార్ట్మెంట్లో ఉండాలని అనుకోలేదు. ఆమెకో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. దాని కోసమని.. 60 ఏళ్ల నాటి ఓ పాత ఇంటిని కొన్నారు. దానిని రెనోవేట్ చేయడం మొదలుపెట్టారు. పాత ఇంటిని అలా మారుస్తున్నారేంటని వేరేవాళ్లు అడిగితే, నీళ్లు వేస్ట్గా పోకుండా వాటర్ మేనేజ్మెంట్కోసం మారుస్తున్నామని చెప్పేది. ఇది విన్నవాళ్లు.. ‘ఏడాది పొడవునా (సుమారు15 రోజులు మినహా) వాన పడే డెహ్రాడూన్లో నీళ్లు కరువా?’ అని నవ్వుకున్నారు. ‘వాన నీళ్లు డ్రైనేజీలో కలిసిపోవడం కరెక్టేనా?’ అన్నది సౌమ్య సమాధానం. ‘ఆ నీళ్లు మనకు ఉపయోగపడాలి. లేకుంటే భూమిలోకి ఇంకాలి. ఇదీ నా కాన్సెప్ట్’ అని అందరికీ చెప్పేదామె. ఇంటి ముందు రెయిన్ హార్వెస్టింగ్ చేసేందుకు ప్లాన్ చేసి 20,000 లీటర్ల నీటిని స్టోర్ చేసే సంప్ కట్టించింది. ఇది 67వేల మందికి ఒక రోజు దాహాన్ని తీర్చగలదు. ఈ నీళ్లనే వాళ్ల ఇంట్లో ఫిల్టర్ చేసి తాగుతున్నారు. పెరటిలో, ఇంటిపై సొంతంగా కూరగాయలు పండిస్తున్నారు.
గవర్నమెంట్కే కరెంటు ఇస్తోంది
గాలిలో కార్బన్ తగ్గాలంటే పెట్రోల్, డీజిల్ వాహనాలు నడపకూడదు. అందుకే ఆమె అయిదేళ్ల కింద ఎలక్ర్టిక్ కారు కొన్నది. అయితే ఆ కారుకు కరెంటు మాత్రం బొగ్గుతో వచ్చేదేగా? దీనివల్ల కూడా పొల్యూషనేగా. అందుకే కరెంట్ కోసం ఇంటి మీద ఓ షెడ్ వేయించి, అయిదు కిలోవాట్స్ కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానెల్స్ వేయించింది. ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, బోర్లు అన్నీ ఇంటి మీద తయారయ్యే కరెంటుతోనే. ఎలక్ర్టిక్ కార్ను కూడా సోలార్ కరెంట్తోనే చార్జ్ చేస్తుంది. అయిదు గంటల్లో కార్ బ్యాటరీ చార్జ్ ఫుల్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు తిరుగుతుంది. మూడేళ్ల నుంచి పెట్రోలు కొనకుండా, పైసా ఖర్చు లేకుండా బిందాస్గా తిరుగుతున్నది. ఏడాదికి లక్ష రూపాయలు పెట్రోల్కి ఖర్చు అనుకున్నా ఆమె కారు కొన్న డబ్బులు ఆదా అయినట్లే కదా. ఇంటి అవసరాలు తీరగా మిగిలిన కరెంట్ను, పవర్ గ్రిడ్కి ఫ్రీగా ఇస్తోంది. ‘ఇదేమీ గొప్ప సేవ కాదు. సోలార్ ప్యానెల్స్కి గవర్నమెంట్ 70 శాతం రాయితీ ఇచ్చింది. ఆ రుణం తీర్చుకుంటున్నా’ అంటోందామె.
తీరొక్క పంట
సౌమ్య తనకు అవసరమైన కూరగాయలు ఇంట్లోనే పండిస్తోంది. రెయిన్ వాటర్తో ఇంటి ముందు, ఇంటి మీద సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తోంది. డెహ్రాడూన్ వాతావరణంలో పండని ఉల్లి, ఆలు తప్ప మిగతా కూరగాయలైన టమాటా, మిర్చి, కొత్తిమీర, క్యాబేజీ, క్యారెట్, బఠాణీతోపాటు, జామ, సపోటా లాంటి పండ్లు కూడా పండిస్తోంది. ఎరువుల్ని కూడా సొంతంగానే తయారు చేసుకుంటుంది. ఇంటి పరిసరాల్లోనే అన్ని రకాల వేస్ట్ మెటీరియల్ని కంపోస్ట్ గా మార్చే ప్లాంట్ ఉంది. కిచెన్లో మిగిలిపోయిన కూరగాయల ముక్కలు, తొక్కలు, చెట్ల ఆకులతో కంపోస్ట్ తయారు చేస్తుంది.
మాటలొద్దు చేతలే
‘మంచి పుడ్ తింటున్నం, పొల్యూట్ కాని నీళ్లు తాగుతున్నం. హెల్దీగా ఉన్నం. ఈ ప్రపంచం మారాలని కోరుకుంటే ఆ మార్పుని మన జీవితంలో, మన ఇంట్లో నుంచి నిర్మించుకుంటూ పోవాలని గాంధీ అన్నారు. నేనూ అదే ఫాలో అవుతున్నా’ అంటోంది సౌమ్య.