న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్(ఐటీ శాఖ) మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1745 కోట్లకు ఐటీ శాఖ డిమాండ్ నోటీసులు ఇచ్చింది. 2014–15 నుంచి 2016–17 అసెస్ మెంట్ ఇయర్స్కు సంబంధించి ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరింది. ఈ నోటీసులతో కాంగ్రెస్ చెల్లించాల్సిన మొత్తం రూ.3,567 కోట్లకు చేరుకుంది. 2014–15లో (రూ.664 కోట్లు), 2015–16లో (రూ.664 కోట్లు), 2016–17లో (రూ.417 కోట్లు) చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
కాగా, రాజకీయ పార్టీలకు ఇస్తున్న పన్ను మినహాయింపులకు అధికారులు ముగింపు పలికారు. కాంగ్రెస్ పార్టీకి అందిన మొత్తం నిధులపై పన్ను విధించారు. శుక్రవారం కూడా ఐటీ శాఖ రూ.1823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్ను కోరింది. గత అసెస్ మెంట్ ఇయర్స్కు సంబంధించి పార్టీ ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఐటీ శాఖ ఇప్పటికే రికవరీ చేసింది. దీనిపై హైకోర్టు ఇన్ కంట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.