న్యూఢిల్లీ: ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఓ సాహసం అతనితో పాటు టీమిండియాకు భారీ చేటు చేసింది. మోకాలి గాయానికి ఆపరేషన్తో పాటు టీ20 వరల్డ్కప్కూ అతను దూరమయ్యేలా చేసింది. అయితే జడ్డూ మోకాలి గాయం.. క్రికెట్ వల్ల కాలేదని టీమ్ వర్గాలు వెల్లడించాయి. ‘జట్టు బస చేసిన హోటల్ బ్యాక్ వాటర్లో జడేజా ఓ క్లిష్టమైన స్కై బోర్డును బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతని మోకాలు మెలి తిరిగింది. వాస్తవానికి ఇది ఆటగాళ్ల శిక్షణలో భాగం కూడా కాదు. అది పూర్తిగా అనవసరమైన చర్య’ అని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రిహాబిలిటేషన్లో ఉన్న జడ్డూపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహాంతో ఉన్నట్లు సమాచారం.