జమ్మూ కాశ్మీర్లో ని రాంబన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూశ్రీనగర్ నేషనల్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.T2 వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ NHW బ్లాక్ చేయడంతో జమ్మూకు వెళ్తున్న అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. జూలై 19న రాంబన్ జిల్లాలో జాతీయ రహదారి-44 పై కొండచరియలు విరిగి పడిన తర్వాత ఈ రోజు (ఆగస్టు 06)న 1,626 మంది యాత్రికుల తాజా బ్యాచ్తో అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఇప్పటివరకు జూలై 1 నుంచి3,888 మీటర్ల ఎత్తైన అమర్నాథ్ గుహ క్షేత్రాన్ని 4.17 లక్షల మంది యాత్రికులు సందర్శించారు.
270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాంబన్ జిల్లాలోని చంకర్కోట్ యాత్రి నివాస్ వద్ద యాత్రికులను నిలిపివేశారు. ఇది కీలా మోర్ సమీపంలో కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక ఆల్-వెదర్ రహదారి అని అధికారులు పేర్కొన్నారు.అయితే రోడ్డు మార్గం పునరుద్దరించేవరకు యాత్రికులు ప్రయాణం రద్దు చేసుకోవాలని సూచాంచారు.
VIDEO | Restoration work underway following heavy landslide on Jammu-Srinagar National Highway at T2 tunnel near Keela Morh in Ramban district.
— Press Trust of India (@PTI_News) August 6, 2023
(Source: Third Party) pic.twitter.com/qexVa5ubBY