ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ రాహుల్శర్మ

ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ రాహుల్శర్మ

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని సీసీఐ ఆఫీసర్లు, మిల్లర్లకు జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్​ రాహుల్​శర్మ పేర్కొన్నారు. శుక్రవారం చిట్యాల మండలంలోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లు, బాల మురగన్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను  పరిశీలించారు. 

పత్తి తేమ, తూకం (కాంటా), రైతుల నమోదు వివరాలు, కాపాస్ కిసాన్ యాప్​లో నమోదు వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ అశోక్ కుమార్, తహసీల్దార్ ఇమామ్ బాబా, సీసీఐ ఇన్​చార్జి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు.