![5 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న జేసీబీ](https://static.v6velugu.com/uploads/2024/03/jcb-india-achieves-production-milestone-of-5-lakh-machines_OYsWjL6SwX.jpg)
హైదరాబాద్, వెలుగు: ఎర్త్మూవింగ్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ తయారీదారు జేసీబీ ఇండియా ఐదు లక్షల మెషీన్ల మైలురాయిని సాధించింది. దీని విడుదల వేడుకలను బల్లబ్గఢ్లోని కంపెనీ ఇండియా హెడ్ క్వార్టర్స్లో జేసీబీ గ్రూప్ చైర్మన్ లార్డ్ బామ్ఫోర్డ్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీబీ 1979 నుంచి భారతదేశంలో ఉందన్నారు. మనదేశంలో ఆరు తయారీ సౌకర్యాలతో జేసీబీ 'మేడ్ ఇన్ ఇండియా' యంత్రాలను 130 దేశాలకు ఎగుమతి చేస్తోందన్నారు.