
హైదరాబాద్, వెలుగు: తన సబ్సిడరీ మాంబా కాలరీస్ లిమిటెడ్ (ఎంసీఎల్) ఫైనాన్షియల్ పొజిషన్ టర్న్ అరౌండ్ అయినట్లు నవ లిమిటెడ్ వెల్లడించింది. అంతేకాదని, ఈ సబ్సిడరీ తీసుకున్న అప్పులను తిరిగి చెల్లిస్తోందని తెలిపింది. 2022 డిసెంబర్ నాటికి రూ. 3,999 కోట్లున్న అప్పులు ప్రస్తుతం రూ. 2,296 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఎనర్జీ సేల్స్ పేమెంట్స్ను జెస్కో మే 2022 నుంచి ఎంసీఎల్కి చెల్లిస్తోందని వివరించింది.
మరోవైపు, జాంబియా ఎలక్ట్రిసిటీ సప్లయ్ కార్పొరేషన్ (జెస్కో) ఆర్బిట్రేషన్ సెటిల్మెంట్ కింద బకాయిలను ఎంసీఎల్కి చెల్లిస్తోందని, ఈ ఏడాది డిసెంబర్లోపు 338 మిలియన్ డాలర్లను జెస్కో చెల్లించనుందని తెలిపింది. మరో 180 మిలియన్ డాలర్లను డిసెంబర్ 2024 లోపు జెస్కో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇటీవల చెల్లించిన 60 మిలియన్ డాలర్లతో కలిపి ఇప్పటిదాకా జెస్కో మొత్తం 181 మిలియన్ డాలర్ల చెల్లింపులను ఎంసీఎల్కు రిలీజ్ చేసింది.