మీసేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : పోతులపల్లి శివకుమార్

మీసేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : పోతులపల్లి శివకుమార్

వనపర్తి టౌన్, వెలుగు: మీ సేవా ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని మీసేవ యూనియన్  జిల్లా అధ్యక్షుడు పోతులపల్లి శివకుమార్, గౌరవ అధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్​ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మీసేవా ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్  పాలనలో ఇంటర్నెట్​ సెంటర్లలో ఆన్​లైన్  సేవలు అందించడంతో మీసేవ కేంద్రాల నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. ధరణి ఆన్​లైన్  సేవలతో మీ సేవలో ఉన్న ఆర్ఓఆర్, పహాణి, ఓటర్  ఐడీ డౌన్​లోడ్  తదితర సర్వీసులను మీసేవ నుంచి వేరు చేయడంతో నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్, చక్రవర్తి, శేఖర్, బాలరాజు, ఈశ్వర్, యుగంధర్, బాలరాజు, శ్రావణ్ కుమార్, అరుణ్ చందర్, అంజి, గంగన్న పాల్గొన్నారు.