బిట్​ బ్యాంక్ : సామాజిక సాంస్కృతిక జాగృతి 

బిట్​ బ్యాంక్ : సామాజిక సాంస్కృతిక జాగృతి 
  •     1893లో మహ్మదియన్​ ఆంగ్లో ఓరియంటల్​ డిఫెన్స్​ అసోసియేషన్​ సయ్యద్​ అహ్మద్​ ఖాన్​ స్థాపించాడు. 
  •     సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా ప్రజల్లో రాజులు దైవాంశ సంభూతులనే భావం సడలింది. 
  •     1784లో ఏషియాటిక్​ సొసైటీ స్థాపించారు.
  •     మన మతం మన వంటింట్లోది అని అన్నది స్వామి వివేకానంద.
  •     నాకు మరో జన్మ అంటూ ఉంటే అంటరాని వాడిగానే పుడతాను అని గాంధీ అన్నారు.
  •     అనీబిసెంట్​ స్థాపించిన కేంద్ర హిందూ పాఠశాల మదన్​ మోహన్​ మాలవ్య ఆధ్వర్యంలో బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయంగా మారింది.
  •     బ్రహ్మ సమాజం మత గ్రంథాలను అన్వయించడానికి పురోహిత వర్గం ఆవశ్యకతను నిరాకరించింది.
  •     మానవ జాతికి కులం లేదు, మతం లేదు, దేవుడు లేడు అని ప్రకటించిన నాయకుడు అయ్యప్పన్​. 
  •     ఆత్మగౌరవ ఉద్యమ నాయకుడు రామస్వామి నాయకర్​.
  •     సత్యశోధక్​ సమాజాన్ని జ్యోతిబా పూలే స్థాపించారు.
  •     మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి దయానంద సరస్వతి.
  •     గిరిజన ప్రజలను దేవుని ప్రతి రూపమని ఫాదర్​ ఆఫ్​ ది వరల్డ్​ అని బిర్సాముండా వర్ణించారు. 
  •     బ్రహ్మ సమాజ్​ఇండియాకు కేశవ చంద్రసేన్ నాయకత్వం వహించారు.
  •     బ్రహ్మ సమాజ్​ ఆఫ్​ ఇండియాలో వచ్చిన చీలికలు నియో బ్రహ్మ సమాజ్​, సాధారణ బ్రహ్మ సమాజ్​.
  •     సంవాద కౌముది ఒక త్రైమాసిక పత్రిక.
  •     సంవాద కౌముది బెంగాలీ భాషలో ప్రచురించబడింది.
  •     రాజా రామ్​మోహన్​ రాయ్​ రాధానగరంలో 1774లో జన్మించాడు.
  •     మిరాత్​ ఉల్​ అక్బర్​, సంవాద కౌముది, బంగదూత రాజా రామ్​మోహన్​ రాయ్​ పత్రికలు.
  •     బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా 1829లో ధర్మసభ లేదా ధర్మ సమాజాన్ని రాధాకాంత్​దేబో స్థాపించారు. 
  •     ప్రిసెప్ట్స్​ ఆఫ్​ జీసస్​, గైడ్​ టు పీస్ రాజా రామ్​మోహన్​ రాయ్​కు సంబంధించిన పుస్తకాలు. 
  •     విలియం జోన్స్​ ఏషియాటిక్​ సొసైటీని 1784లో స్థాపించారు.
  •     భగవద్గీతను ఆంగ్లంలోకి జాన్​ విల్​కిన్స్​ తర్జుమా చేశారు.
  •     బ్రిటీష్​ గవర్నర్​ విలియం బెంటింక్​ సతీసహగమన నిషేధ చట్టాన్ని రాజా రామ్​మోహన్​ రాయ్​ ప్రోత్సాహంతో చేశారు.
  •     వేదాలను జర్మన్​లోకి మాక్స్​ముల్లర్​ తర్జుమా చేశారు.
  •     దేవంద్రనాథ్​ ఠాగూర్​కు గల బిరుదు బ్రహ్మర్షి.
  •     1833లో రాజా రామ్​మోహన్ రాయ్​ బ్రిస్టల్​ నగరంలో మరణించాడు. 
  •     బ్రహ్మ సమాజాన్ని వన్​ గాడ్​ సొసైటీగా పిలుస్తారు.
  •     ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వారపత్రిక సోమ్​ ప్రకాష్​ (బెంగాలీ).
  •     1864లో  ఆగ్రాలో రాధాసామి సత్సంగ్​ స్థాపించింది తులసీరామ్​.
  •     రాజా రామ్​మోహన్​ రాయ్​, అలెగ్జాండర్​ డఫ్​, డేవిడ్​ హ్యూరేల సహాయంతో 1825లో బెంగాల్​లో ఏర్పాటు చేసిన ఆంగ్ల పాఠశాల వేదాంత పాఠశాల.
  •     హెన్రీ వినియన్​ డిరాజియో బెంగాల్​లో యువ బెంగాల్​ ఉద్యమం ప్రారంభించారు.
  •     హెన్రీ వినియన్​ డిరాజియో 1831లో కలరా వ్యాధితో మరణించారు.
  •     హెన్రీ వివియన్​ డిరాజియో ముఖ్య శిష్యుడు ఖాసీ ప్రసాద్​ ఘోష్​.
  •     తత్వబోధిని సభ (ట్రూత్​ టీచింగ్​ అసోసియేషన్​)ను దేవేంద్రనాథ్​ ఠాగూర్​ స్థాపించారు.
  •     ఈశ్వరచంద్ర విద్యాసాగర్​ 1849లో బాలికల కోసం బెథూన్ పాఠశాల స్థాపించారు.
  •     ఈశ్వర చంద్ర విద్యాసాగర్​ కృషి ఫలితంగా డల్హౌసి వితంతు పునర్వివాహ చట్టం 1856లో చేశారు.
  •     ఈశ్వరచంద్ర విద్యాసాగర్​ అధికార వితంతు పునర్వివాహం 1856, డిసెంబర్​లో కలకత్తాలో జరిగింది.
  •     మత గ్రంథాలను పూజించే సంప్రదాయమైన సమాజాన్ని లాహోర్​లో 1887లో శివనారాయణ అగ్నిహోత్రి ప్రారంభించారు.
  •     గాడ్​ ఈజ్​ ఆఫ్​ యాన్​ యూజ్​ఫర్​ ద హంగ్రి బెల్లి అన్నది రామకృష్ణ పరమహంస.
  •     రామకృష్ణ మిషన్​కు మరోపేరు వేదాంత ఉద్యమం.
  •     ఇండియా నీడ్స్​ టు కాంకర్​ వరల్డ్​ వన్స్​ అగెయిన్​ అన్నది స్వామి వివేకానంద.
  •     ఈశ్వరచంద్ర విద్యాసాగర్​ ఫిలిప్​ డ్రింక్​ వాటర్​ సాయంతో కలకత్తాలో బాలికల పాఠశాలను 1849లో స్థాపించారు.
  •     ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవా కార్యక్రమాలు అందజేయడం ముఖ్యోద్దేశంగా అలహాబాద్​లో 1914లో సేవా సమితిని హెచ్​.ఎన్.కుంజ్రు స్థాపించారు.