కడెంను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ ప్యానల్

కడెంను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ ప్యానల్

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును శుక్రవారం సెంట్రల్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ సభ్యులు సందర్శించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రాజెక్టును పరిశీలించారు. డ్యామ్ గేట్ల పరిస్థితిని, ఎగువ నుంచి వచ్చే వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు గేట్లనే కాకుండా స్పిల్ వేను, కాల్వలను పరిశీలించారు.

 అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏపీ పాండ్యా, డాక్టర్ రామరాజు, విజయ్ దేశాయి, ఎం.రాజు, సత్యనారాయణ, యోగిధర్ కుమార్ శర్మ పాల్గొన్నారు.