కామారెడ్డిటౌన్, వెలుగు: మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, ఎవరూ ఉల్లంఘించవద్దని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను శనివారం కలెక్టర్ పరిశీలించారు. స్ర్టాంగ్ రూమ్ను తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.
