శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు : ఎస్పీ రాజేష్ చంద్ర

శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు : ఎస్పీ రాజేష్ చంద్ర
  • కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర          

కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పకడ్భందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు.  పంచాయతీ ఎన్నికల నామినేషన్ల  దృష్ట్యా గురువారం రామారెడ్డి , పోశానిపేట, మాచారెడ్డిలో ఎస్పీ  పర్యటించారు. 

  నామినేషన్​ సెంటర్ల వద్ద  ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి  పలు సూచనలు చేశారు.  అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..   ఎన్నికల శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని తెలిపారు.   ఎలాంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా అధికారులు అలర్టుగా ఉండలన్నారు.   సెన్సిటివ్​ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.    ఏఎస్పీ ఛైతన్యారెడ్డి,  సీఐలు, ఎస్సైలు ఉన్నారు.