
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్పై చిందులు వేసింది. ఇటీవల రణ్వీర్ సింగ్ అలియా భట్తో తీసిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాను అత్తాకోడళ్ల డ్రామా అంటూ కొట్టిపారేసింది. దీనికి రూ. 250 కోట్ల బడ్జెట్టా?.. ఇలాంటి సినిమాలు తీసే బదులు రిటైర్మెంట్ తీసుకో అంటూ కరణ్పై పోస్ట్ చేసింది.
అలాగే హీరో రణ్వీర్పై మాట్లాడుతూ.. నువ్వు కరణ్లా బట్టలేసుకుంటూ అతడిలానే తయారవ్వకు. నలుగురిలో డిగ్నిటీతో ఎలా ఉండాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో సౌత్ హీరోలను చూసి నేర్చుకో.. మన సంస్కృతిని నాశనం చేయకు అంటూ చివాట్లు పెట్టింది. ట్యాలెంట్ ఉన్న వారు చాన్స్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లేమో ఇలాంటి సినిమాలతో టైం, మనీ వేస్ట్ చేస్తున్నారంటూ కంగనా మండిపడింది.