అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

కన్సాస్: అమెరికాలోని మిస్సోరీ కన్సాస్​ సిటీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. స్పాట్​లోనే ఇద్దరు మృతిచెందారని మూడో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. 

మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించామని, ఇందులో ఒకరి పరిస్థితి సీరియస్​గా ఉందని కన్సాస్​ సిటీ పోలీస్​లు చెప్పారు. ఇండియానా ఎవెన్యూ క్లైమాక్స్ లాంజ్​లో శనివారం అర్ధరాత్రి దాటాక సుమారు1:25 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని పోలీసులు​ తెలిపారు. .

బార్​లోనే ఒకరు మరణించారని మరో వ్యక్తి బార్ బయట చనిపోయినట్లు డ్రేక్​ వివరించారు. డిటెక్టివ్​లు, క్రైమ్​సీన్​ ఇన్వెస్టిగేటర్స్​ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని కన్సాస్​ పోలీసులు వెల్లడించారు.