తెలంగాణ ప్రజల తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది : బండి సంజయ్

తెలంగాణ ప్రజల తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది : బండి సంజయ్

తెలంగాణ ప్రజల తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోందన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొట్టానని చెప్పారు. ఫాంహౌజ్ నుండి ధర్నాచౌక్ కు కేసీఆర్ ను గుంజుకొచ్చానని అన్నారు. ప్రగతి భవన్ నుండి ప్రజల్లోకి లాక్కొచ్చాను అని చెప్పారు. కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేశానని అన్నారు. 

కరీంనగర్ రేకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో యువత తమ దమ్ము చూపాలని కోరారు. పింక్ జెండాతో గెలిచి పచ్చ జెండాలతో తిరిగే వాళ్లకు సరైన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం కరీంనగర్ ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టు పెట్టే నేతలకు గుణపాఠం చెప్పాలని కోరారు. 

ALSO READ :-