
కర్ణాటకలోని మంగళూరులో మద్యం మత్తులో ఉన్న మహిళకు, పోలీసు అధికారులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. ఈ సంఘటన సెప్టెంబర్ 10న జరిగింది. మద్యం మత్తులో ఉన్న మహిళతో పోలీసులు వ్యవహరించే తీరును ఈ వీడియో చూపిస్తోంది.
ALSO READ: భారత్ లో నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి
ఈ వీడియోలో, మహిళను లేపడానికి మహిళా పోలీసు అధికారులు ఆమెకు సహాయం చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం నేలపై పడుకుని అలానే కనిపించింది. కాసేపటి తర్వాత పోలీసు అధికారి ఒకరు ఆమెను ప్రశ్నించడంతో అధికారులు ఆమెను కుర్చీపై కూర్చోబెట్టారు. అయితే, మహిళ సమాధానం చెప్పకుండా.. దానికి బదులుగా అధికారిని కాలితో తన్నింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇతర మహిళా అధికారులు ఆ మహిళను అణచివేసి శాంతింపజేయడానికి ప్రయత్నించారు. వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఆ మహిళ అలాగే ప్రతిఘటించడం, తీవ్ర వాగ్వివాదానికి దిగడం ఈ వీడియోలో చూడవచ్చు. మహిళ తాగి ఉందని ఆరోపించిన కార్యకర్త బర్ఖా ట్రెహాన్ అనే X యూజర్ లో ఈ వీడియోను పంచుకున్నారు.
అయితే, సదరు మహిళ పోలీసు అధికారులతో ఎందుకు హింసాత్మకంగా ప్రవర్తించిందో తెలుసుకోవడానికి విచారణ జరుగుతోందని ఓ జర్నలిస్ట్ థ్రెడ్లో పోస్ట్ చేశాడు. మహిళ మత్తుమందు తాగిందా లేదా అనే దానిపై మహిళ మెడికల్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఈ తరహా వ్యక్తులతో పోలీసులు ఎదుర్కోవడం పెద్ద సవాలుగానే తోస్తుందని పలువురు అంటున్నారు. కాగా ఈ ఘటనపై స్థానిక అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
DISGUSTING!
— Barkha Trehan ?? / बरखा त्रेहन (@barkhatrehan16) September 11, 2023
Another VIRAL video of an alcoholic GIRL, quarreling with the POLICE.
It's difficult to deal with a spoiled brat, she's uncontrollable.
FEMINISTS please comment ? pic.twitter.com/ALHnp5GB7B