ఏప్రిల్ 05న కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన

ఏప్రిల్ 05న కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  బీఆర్ఎస్  అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 2024 ఏప్రిల్ 05న పర్యటించనునన్నారు. పొలం బాటలో భాగంగా  ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ నుంచి  బయలుదేరి  10 గంటల వరకు  కరీంగనర్ కు చేరకుంటారు.  కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.  

కరీంనగర్ నియోజకవర్గంలోని మొగ్దుంపూర్​, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంతోపాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్ల పార్టీ ఆఫీసులో ప్రెస్​మీట్​ నిర్వహించనున్నారు.  ఈ మేరకు బీఆర్​ఎస్‌ లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.  .

కాగా  ఇటీవల జనగామ, యాదాద్రి, సూర్యపేట జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ 13న చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.  అనంతరం ఏప్రిల్ 15 మెదక్ లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో పాల్గొంటారు.  

ALSO READ :-Priyanka Chopra: హాలీవుడ్ టార్గెట్..బోర్న్ హంగ్రీ నిర్మాతగా ప్రియాంక చోప్రా