కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని జలసౌధతోపాటు పది చోట్ల మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది. జలసౌధలో దాదాపు ఎనిమిది గంటలకుపైగా సోదాలు జరిగాయి. ఈఎన్సీ మురళీధర్తోపాటు ఇతర సీనియర్ ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్టు డిజైన్స్, డ్రాయింగ్స్, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, టెండర్ డాక్యుమెంట్లు, కాస్ట్ ఎస్కలేషన్ రిపోర్టులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
12 టీమ్లతో..
ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ఎన్ఫోర్స్మెంట్ఎస్పీ శ్రీనివాస్రావు నేతృత్వంలో 12 టీమ్లు తనిఖీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్లోని జలసౌధతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఎల్ఎండీ కాలనీ క్యాంప్, రామగుండం, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జలసౌధలో మంగళవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. విజిలెన్స్ అధికారులు జలసౌధకు చేరుకోగానే మొదట సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకొని మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి ఇచ్చేశారు. తనిఖీలు జరుగుతున్న క్యాబిన్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా జలసౌధ ప్రధాన గేట్ల వద్ద సిబ్బందిని కాపలాగా ఉంచారు.
ఎవరు జలసౌధ భవనంలోని పైఅంతస్తుల్లోకి వెళ్లకుండా, కిందికి దిగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సెకండ్ఫ్లోర్లోనిఈఎన్సీ (జనరల్) మురళీధర్ఆఫీస్నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్లకు సంబంధించిన అన్ని రికార్డులు సీజ్చేసి స్వాధీనం చేసుకున్నారు. అదే ఫ్లోర్లో ఉన్న పీ అండ్ఎం ఎస్ఈ శ్రీనివాస్నుంచి పలు రికార్డులు తీసుకున్నారు. ఆయన నుంచి సమాచారం సేకరించారు. అదే ఫ్లోర్లో ఉన్న హైడ్రాలజీ డిపార్ట్మెంట్నుంచి గోదావరిలో ప్రవాహాలు, మేడిగడ్డకు అనుమతులు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్ఫ్లోర్లోని కాళేశ్వరం కార్పొరేషన్ఎండీ, గజ్వేల్ఈఎన్సీ హరిరాం ఆఫీస్నుంచి కార్పొరేషన్ అప్పులు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఆయన నుంచి సమాచారం సేకరించారు.
సీడీవో సీఈ ఆఫీస్ నుంచి 16 కీలక ఫైళ్లు
జలసౌధ ఆరో అంతస్తులోని సెంట్రల్డిజైన్స్ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ ఆఫీస్నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 16 కీలక ఫైళ్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫైళ్లలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో లోపాలకు సంబంధించిన డిజైన్లు.. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్ల ముంపునకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ఇతర కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి. ఐదో ఫ్లోర్లోని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్ఆఫీస్లో తనిఖీలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నాలుగో ఫ్లోర్లోని ఓ అండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు చాంబర్లో తనిఖీలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్ల ముంపు గురించిన సమాచారాన్ని ఆయన నుంచి సేకరించారు.
మురళీధర్తో ప్రత్యేక సమావేశం
ఈఎన్సీ (జనరల్) మురళీధర్తో విజిలెన్స్ఎస్పీ శ్రీనివాస్రావు ప్రత్యేకంగా సమావేశమై కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్–1కు సంబంధించిన సమాచారం సేకరించారు. అరగంటకు పైగా ఆయన నుంచి పలు డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన పనులు, అడిషనల్టీఎంసీకి సంబంధించిన డిజైన్లు, ఆయా పనులు వర్క్ఏజెన్సీలకు ఎలా కేటాయించారు..? ఎంతమేరకు పనులు పూర్తయ్యాయి..? వర్క్ఏజెన్సీలకు ఎంత బిల్లులు చెల్లించారు..? అనే వివరాలు రాబట్టారు. సాయంత్రం 5.45 గంటల తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన కీలక రికార్డులన్నీ తీసుకొని విజిలెన్స్అధికారులు జలసౌధ నుంచి వెళ్లిపోయారు. సుమారు ఎనిమిది గంటలకు పైగా జలసౌధలో విజిలెన్స్అధికారులు సోదాలు చేశారు.
మేడిగడ్డ, కన్నెపల్లి, మహదేవ్పూర్ఆఫీసుల్లో తనిఖీలు
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌజ్తో పాటు మహాదేవ్పూర్, రామగుండం, కరీంనగర్లోని ఇరిగేషన్ ఆఫీసుల్లో విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి వరకూ కొనసాగింది. కాళేశ్వరం పనులు జరిగిన దగ్గరే తనిఖీ చేయడానికి విజిలెన్స్ ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో 15 మందికి పైగా ఇరిగేషన్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్అధికారులు మూడు బృందాలుగా మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్హౌస్, అంబట్పల్లి దగ్గర ఉన్న మేడిగడ్డ బ్యారేజీ, మహాదేవపూర్ లోని ఇరిగేషన్ డివిజన్ ఆఫీసుల్లో సోదాలు జరిపారు. లోపలికి ఎవరినీ అనుమతించలేదు. లోపలి నుంచి బయటికి ఎవరినీ రానివ్వట్లేదు. లంచ్ కూడా బయటి నుంచే తెప్పించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రికార్డులను విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ ఆఫీస్ ల నుంచి రికార్డులను రాత్రి 6.30 గంటలకు రెండు కార్లలో మహాదేవ్పూర్లోని ఇరిగేషన్ ఆఫీస్కు తరలించారు. విచారణ బుధవారం కూడా కొనసాగే అవకాశముంది.
ఇంజనీర్లలో టెన్షన్
కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం విజిలెన్స్ఎంక్వైరీకి ఆదేశించడంతో ఇరిగేషన్ఇంజనీర్లలో టెన్షన్నెలకొంది. మంగళవారం ఒక్కసారిగా విజిలెన్స్అధికారులు జలసౌధతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని హైరానా పడుతున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్ల్లో పని చేసిన ఇంజనీర్లలో ఆందోళన కనిపిస్తున్నది. ప్రాజెక్టుకు క్లియరెన్స్ఇచ్చిన ఈఎన్సీ (జనరల్)తో పాటు అడ్మినిస్ట్రేటివ్శాంక్షన్ఇచ్చిన అప్పటి ప్రిన్సిపల్సెక్రటరీ, డిజైన్లు క్లియర్చేసిన సీఈ సీడీవోలోని ఇంజనీర్లు, ఫీల్డ్ఇంజనీర్లు సహా ఇతర అధికారులు కలుపుకొని మొత్తం 33 మందిపై విచారణ చేపట్టే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడటం.. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్లు మునిగిపోవడానికి డిజైన్ల లోపంతో పాటు ఆపరేషన్అండ్మెయింటనెన్స్ను పూర్తిగా గాలికి వదిలేయడమే కారణమని డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం క్రెడిట్తమదేనని చెప్పుకున్న ఇంజనీర్లే ఇప్పుడు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైతే లింక్-1లోని డాక్యుమెంట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, రానున్న రోజుల్లో మొత్తం ప్రాజెక్టులోని లోపాలపైనా ప్రభుత్వం విజిలెన్స్ఎంక్వైరీ చేయించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. విజిలెన్స్తనిఖీల నేపథ్యంలో బుధవారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్డిపార్ట్మెంట్పై సమీక్ష ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మేడిగడ్డ నుంచి హైదరాబాద్వరకు ఉన్న పది ఇరిగేషన్ఆఫీసుల్లో విజిలెన్స్అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగిపోయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించిందని, మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో అధికారులతో పవర్పాయింట్ప్రజెంటేషన్కూడా ఇప్పించామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై సిట్టింగ్జడ్జితో జ్యుడీషియల్ఎంక్వైరీ కోరుతూ హైకోర్టు సీజేకు లేఖ రాయాలని రాష్ట్ర కేబినెట్ఇప్పటికే తీర్మానించిందని, ఈ మేరకు సీజేకు లేఖ రాశామని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫల్యాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్టీపీసీలోని మూడు ఆఫీసుల్లో..!
గోదావరిఖని/కరీంనగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఏరియాలో గల మూడు ఇరిగేషన్ ఆఫీస్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అన్నపూర్ణ కాలనీలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫీస్, క్వాలిటీ కంట్రోల్, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ఈ ఆఫీస్లను ఉదయమే తమ ఆధీనంలోకి తీసుకుని రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో డీఎస్పీ కమలాకర్ రెడ్డి, డీఈలు శ్రీనివాస్, బాలకృష్ణతో పాటు 12 మంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఆఫీసులోనూ విజిలెన్స్ అధికారులు సోదాలు జరిపారు. విజిలెన్స్ ఎస్పీ వెంకటరమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస రావుతో పాటు 12 మంది అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ముందుగా.. ఇటీవల కంప్యూటర్లు చోరీ జరిగిన ఇరిగేషన్ సర్కిల్ - 5 ఆఫీసుకు వెళ్లి చోరీ వివరాలు ఆరా తీశారు.
మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం గరం
జలసౌధలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ గరమయ్యారు. ‘‘ఎందుకింత హడావుడి చేస్తున్నరు.. అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు.. నన్ను ఎందుకయ్యా చంపుతారు.. విజిలెన్స్అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు.. వాటిని అందజేశాం..” అంటూ ఆయన జలసౌధ నుంచి వెళ్లిపోయారు.