న్యూఢిల్లీ: ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్హర్దీప్సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. పంజాబ్లోని జలంధర్బర్సింగ్పూర్ గ్రామానికి చెందిన నిజ్జర్ కెనడాలో నివసిస్తున్నాడు. మన దేశంలో జరిగిన పలు టెర్రర్ దాడుల్లో నిజ్జర్ ప్రమేయం ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పేర్కొంది. 2021లో జలంధర్ లో ఓ పూజారిపై దాడి కేసుతో పాటు టెర్రర్ దాడులకు సంబంధించిన కేసుల్లో నిజ్జర్ కోసం ఎన్ ఐఏ అధికారులు వెతుకుతున్నారు. నిజ్జర్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చారు. నిజ్జర్ను పట్టిచ్చినా.. అతడి ఆచూకీ గురించి తెలిపినా రూ.10 లక్షలు బహుమానంగా అందిస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిజ్జర్ కెనడా పారిపోయాడు. కొంతకాలంగా అక్కడే ఉంటున్న నిజ్జర్.. తాజాగా గురుద్వార బయట పార్క్ చేసిన కారులో శవమై కనిపించాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:27 సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్పై కాల్పులు జరిపారు. దీంతో అతడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. నిజ్జర్ డెడ్బాడీని తరలించే సమయంలో కొంతమంది ఖలిస్తాన్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.