- ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కాంగ్రెస్ పార్టీతోనే కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి చెందుతోందుని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని 55వ డివిజన్లో మంగళవారం ఏర్పాటైన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలిపి కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనన్నారు.
దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని పాల్వంచలోనే ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నేత, కార్యకర్తపై ఉందన్నారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ నేతలు నాగ సీతారాములు, వై. శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల మురళి, కోనేరు సత్యనారాయణ, టి. దేవీ ప్రసన్న, అర్జున్ రావు, మేరెడ్డి జనార్దన్ రెడ్డి, నాగేంద్ర త్రివేధి పాల్గొన్నారు.
