బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిస్తే..ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంస్య విగ్రహం పెడ్తం : కేటీఆర్

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిస్తే..ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంస్య విగ్రహం పెడ్తం : కేటీఆర్
  • జూబ్లీహిల్స్​లో కారుకు, బుల్డోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య పోటీ: కేటీఆర్ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్  ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఎన్టీఆర్​కాంస్య విగ్రహం పెట్టి.. మాగంటి సునీత చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. ఈ ఎన్నిక కారుకు, బుల్డోజర్​కు మధ్య పోటీ అని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్​లోని  వెంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్ రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎకానమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చామని వివరించారు. రెండేండ్ల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ దెబ్బకు హజారుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రి చేశారన్నారు. రెండేండ్లుగా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. 

‘‘ఈ ఎన్నిక కేవలం అభ్యర్థులకు మాత్రమే కాదు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి కూడా. కాంగ్రెస్​ విధ్వంసం ఆగాలంటే ఆ పార్టీని ఓడించాలి. ఇండ్లపైకి బుల్డోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రావొద్దంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించాలి. మాగంటి సునీతను గెలిపించాలి”అని కేటీఆర్​పిలుపునిచ్చారు. హైదరాబాద్​లో ఎయిర్​పోర్టుకు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు తీసేసి రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం పెడతామంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు.