రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్లో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరై వన దేవతలను మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు. అనంతరం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో క్లస్టర్ రైతు వేదికను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ లో జరుగుతున్న సమ్మక్క - సారలమ్మ జాతరకు హాజరై వన దేవతలను దర్శించుకున్న మంత్రి శ్రీ @KTRTRS pic.twitter.com/x1LGAyGhYG
— Thirupathi Bandari (@BTR_KTR) February 18, 2022
‘రాష్ట్రవ్యాప్తంగా 2603 రైతు వేదికలను దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటుచేశాం. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతాంగానికి మద్ధతుగా నిలిచింది. ఈ రైతు వేదికల ద్వారా రైతు సంఘటిత శక్తిని దేశానికి చూపిస్తున్నాం. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి.. దానికి ఓ అధికారిని నియమిస్తున్నాం. ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఒక్క తెలంగాణాలోనే అమలవుతున్నాయి. కాళేశ్వరం జలాల వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు దాదాపు ఆరు మీటర్లు పెరిగాయి.ఇక్కడున్న నీటిపారుదల విధి విధానాలు యువ ఐఏఎస్లకు పాఠ్యాంశాలుగా మారడం యావత్ తెలంగాణకే గర్వకారణం’ అని కేటీఆర్ అన్నారు.
రైతులు వ్యవసాయ సంబంధిత అంశాలపై అధికారులుతో చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు దేశంలోనే తొలిసారిగా రైతు వేదికలను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా, బద్దెనపల్లిలో రైతు వేదిక క్లస్టర్ ను మంత్రి శ్రీ @KTRTRS ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు pic.twitter.com/jAA8lNhocw
— Thirupathi Bandari (@BTR_KTR) February 18, 2022
For More News..