ఆ కారు నాదే.. అందులో నా కొడుకు లేడు

ఆ కారు నాదే.. అందులో నా కొడుకు లేడు

లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా అందులో లేడని చెప్పారు. కారు అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపించిన మిశ్రా.. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్నారు.  

‘ఘటన జరిగిన సమయంలో ఆ కారులో నా కొడుకు లేడు. కారుపై జరిగిన అటాక్‌లో డ్రైవర్ గాయపడ్డాడు. దీంతో కారు అదుపుతప్పి అక్కడ ఉన్న పలువురిపైకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఖలిస్థాన్ పోరాటానికి చెందిన కొందరు ఉన్నారు. మృతుల కుటంబాలకు నా సానుభూతి తెలుపుతున్నా. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపాలి’ అని అజయ్ మిశ్రా కోరారు. కాగా.. నేటి తన ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్ తనను ఢిల్లీకి పిలవలేదని.. వ్యక్తిగత పనుల కోసం మాత్రమే వెళ్తున్నానని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు: 

మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

లవ్​మ్యారేజ్​ చేసుకుందని బిడ్డను తీస్కపోయిన్రు

‘రామాయణ్’ రావణుడు ఇకలేడు..

ఖాళీలుంటే నోటిఫికేషన్లు ఎందుకియ్యరు?

మాస్ కాంబో ‘అఖండ’ రెడీ