వరంగల్‌లో పోలింగ్ సందర్భంగా లాఠీచార్జ్

వరంగల్‌లో పోలింగ్ సందర్భంగా లాఠీచార్జ్
  • 16వ డివిజన్ ధర్మారంలో ఉద్రిక్తత
  • డబ్బుల పంపిణీ విషయంలో ఘర్షణకు దారితీసిన వాగ్వాదం 

వరంగల్ అర్బన్ : ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరో వైపు బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం లాఠీజార్జ్ కు దారితీసింది. వరంగల్ 16వ డివిజన్  ధర్మారంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ సందర్భంగా డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న సమాచారం కలకలం రేపగా.. టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఇది ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. దొరికిన వారిని దొరికినట్లే లాఠీలతో ఇరగదీయడంతో ఇరువర్గాల కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. పోలింగ్ కొద్దిసేపట్లో ముగియనుండగా జరిగిన ఘటన దావానలంలా వ్యాపించడంతో ఉద్రిక్తత సృష్టించింది. డబ్బుల పంపిణీ విషయంలో చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం.