తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం తోనే గ్రేహౌండ్స్ బలగాలు ఆరుగురిని కాల్చి చంపాయని ఆరోపణలు చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. అధికారపార్టీ నాయకులు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు చేశారు.
ఇవి కూడా చదవండి
MLA,MLCల సమక్షంలోనే టీఆర్ఎస్ నాయకుల కొట్లాట
సుకుమార్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైన అల్లు అర్జున్
బదిలీల విషయంలో ప్రభుత్వ తీరుపై టీచర్ల ఆగ్రహం