లింగంపల్లి - విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ ప్రారంభం

లింగంపల్లి - విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ ప్రారంభం

విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం(అక్టోబర్ 17) నుంచి మళ్లీ ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12805 ఎప్పటి మాదిరిగానే ఉదయం 6.15 గంటలకు విశాఖలో బయల్దేరి సాయంత్రం 6.45 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.55కి బయల్దేరి బేగంపేటకు 7.09 కి, లింగంపల్లికి రాత్రి 7.40 కి చేరుకుంటుంది. 

అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 12806 లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్ బుధవారం(అక్టోబర్ 18) నుంచి ప్రారంభించబడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

లింగంపల్లిలో ఉదయం 6.15కి బయల్దేరి బేగంపేటకు 6.38కి, సికింద్రాబాద్‌కు 7 గంటలకు చేరుకుంటుందని స్పష్టం చేశారు. అక్కడి నుంచి 7.10కి బయల్దేరి అదే రోజు రాత్రి 7.40 గంటలకు విశాఖపట్నం చేరుకుటుందని రైల్వే అధికారులు వివరించారు.