- లయన్స్ క్లబ్ జిల్లా సెక్రటరీ లంక రవి
బోధన్, వెలుగు : దివ్యాంగ చిన్నారులను చిన్నచూపు చూడొద్దని, ఆదరించి ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహించాలని లయన్స్ క్లబ్ జిల్లా సెక్రటరీ లంక రవి, సభ్యులు అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, సందీప్, సీఆర్పీలు దేవానంద్, యూసుఫ్, విజయ్, రమేశ్, శివానంద పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రానికి కుర్చీల అందజేత
పిట్లం : పిట్లం వ్యాక్సినేషన్ కేంద్రానికి బుధవారం పిట్లం లయన్స్క్లబ్ ప్రెసిడెంట్ మున్నూరు నారాయణ కుర్చీలను అందజేసి మాట్లాడారు. పిట్లం పాత పంచాయతీ ఆఫీసులోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చే వారు కుర్చీలు లేక కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారని నిర్వాహకులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. క్లబ్ సభ్యు సహకారంతో కూర్చీలు కొనుగోలు చేసి అందించామన్నారు. క్లబ్ జిల్లా కమిటీ సభ్యులు మర్గల వేణుగోపాల్, కోశాధికారి మారుతిరెడ్డి, సెక్రటరీ బాలు, సభ్యులు బెజుగం చంద్రశేఖర్ పాల్గొన్నారు.
