ఖైరతాబాద్, వెలుగు: ఎన్నికల్లో లోక్ తంత్రిక్జనతా దళ్ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ శాఖ అధ్యక్షుడు రత్నం బూరగ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో పోటీలో ఉంటారని ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే తొలి ఏడాది మహిళను సీఎంను చేస్తామని, రెండో ఏడాది బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామన్నారు. కూకట్పల్లి నుంచి భక్తవత్సలం, కోరుట్ల నుంచి ఎ.పాండురంగ పోటీ చేస్తారని, వారికి బీఫాంలు ఇచ్చినట్టు తెలిపారు.
