నీరవ్ మోడీపై ఎట్టకేలకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది . లండన్లోని వెస్ట్మి నిస్టర్ కోర్టు వారెంట్ జారీ చేసిందని, అతి త్వరలోనే నీరవ్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది. కొద్ది రోజుల్లో నీరవ్ బెయిల్పై విచారణ జరుగుతుందని,అది ముగిసిన వెంటనే అతణ్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు లైన్ క్లియరవుతుందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13వేల కోట్ల కు ముంచి లండన్ పారిపోయిన నీరవ్ను తిరిగి అప్పగించాలంటూ బ్రిటన్ సర్కారును ఈడీ అభ్యర్థిం చడం, దాన్ని యూకే హోం సెక్రటరీ సాజిద్ జావెద్.. కోర్టుకు రిఫర్ చేయడంతో పట్టివేత ప్రక్రియ ముందుకుసాగింది. ఇండియాలో నేరాలకు పాల్పడ్డ నీరవ్, లండన్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్లు, వజ్రాల వ్యాపారం కొనసాగిస్తు న్నట్లు ఇటీవలే ఓ బ్రిటన్ పత్రిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. నీరవ్ అప్పగించేలా బ్రిటన్తో చర్చలు జరుపుతున్నామని విదేశాంగ శాఖ ప్రకటించి న కొన్నాళ్లకే నిం దితుడిపై అరెస్ట్ వారెంట్ జారీకావడం గమనార్హం . ఇక విజయ్ మాల్యా కేసు విచారణ కూడా తుది దశకు చేరిందని, అతని బెయిల్ పిటిషన్ను వెస్ట్మి నిస్టర్ కోర్టు కొట్టేసిన మరుక్షణం అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.