ఆలయ దర్శనానికి వెళ్లొస్తుండగా..బైక్​ను ఢీకొన్న లారీ

ఆలయ దర్శనానికి వెళ్లొస్తుండగా..బైక్​ను ఢీకొన్న లారీ
  • బాలుడి మృతి, తల్లిదండ్రులకు గాయాలు 

గద్వాల, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురం దగ్గర ఆదివారం సాయంత్రం లారీ ఓ బైక్​ను ఢీకొని వీరేశ్(5)​ అనే బాలుడు చనిపోగా,  అతడి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. మండలంలోని బింగు దొడ్డి తండాకు చెందిన వీరేశ్​ నాయక్,  లక్ష్మి దంపతులు తమ కొడుకు వీరేశ్​తో  కలిసి కర్ణాటకలోని ఉరుకుంద ఈరన్న గుడిలో దైవ దర్శనానికి వెళ్లారు. 

తిరిగి వస్తుండగా రాయపురం కుంట దగ్గర సిమెంట్ లోడ్ దింపి వెళ్తున్న  ఓలారీ ఢీకొనడంతో వీరేశ్​అక్కడికక్కడే  చనిపోగా వీరేశ్​ నాయక్ దంపతులకు గాయాలయ్యాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు రాయపురం రోడ్డుపై  బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.